Showing posts with label మీడియా. Show all posts
Showing posts with label మీడియా. Show all posts

Sunday, January 26, 2014

అయితే జె పి తెలంగాణ గురించి ఏం సెప్పాడు ?


ఏంటి బా అలగున్నావ్ ? ఎవడు సినిమా కానీ సూసేసినా వేటి

అదేం లేదు బా. వార్తలు సూస్తే సీకాకుగుంది

ఓసోస్ ఇప్పుడు ఏటై పోనాది

జె పీ కూడా ఇలగ మాట మార్సేసినాడేటి బా . ఎలచ్చన్లు వచ్చే సరికి  ఎవరైనా  ఇంతేనా బా.

ఎలచ్చన్లు పక్కకి  పెట్టేస్. ఇప్పుడు ఏం మాట మార్సేసాడు జె పి

అదేంటి బా అలగంటావ్. తెలంగాణా ఇచ్చేయ్ మన్నాడు  కదేస్

అదా.. ఇప్పుడు కొత్తగా సెప్పే దేటి  ఎప్పుడూ అదే చెప్తున్నాడు కదరా 

ఎప్పుడు చెప్పాడు బా

ఆరేళ్ళ గా చెబుతున్నాడు గా యిభజనతో సమస్యలు అన్నీ తీరిపోవు.  ఇభజన సేసినా వచ్చేది లేదు సెయకపొయినా పొయ్యేది లేదు అని

అవును. మరి ఇప్పుడు సెయ్యమని ఎందుకు సెప్పాడు

ఇంకెన్నాళ్ళు రా ఇలా. ఇప్పటికే ఎంత నట్టం జరిగింది. మన లాటోళ్ళకి పనులు ఉండట్లేదు సరిగ్గా. ధరలు పెరిగిపోతున్నాయి. ఇల్లు గడవట్లేదు. బయట గొడవలు ఎక్కువై పోతున్నాయి. అంతెందుకు రా మా ఇంటి పక్కన మల్లేస్ స్నేహంగా ఉండేవాడు. ఈ గొడవలు మొదలయ్యాకా మాటల్లేవు.ఇడిపోవాలని ఇంత ఇదిగా అన్ని చోట్లా వచ్చాకా ఎంత తొరగా ఇడిపోతే అంత మంచిది. బలవంతంగా ఉంచితే ఎవరూ సుఖంగా ఉండలేరు, పోరు పెద్దదవుతాది. పేమ సిన్నదవుతాది. అందుకని తొరగా ఇది తేల్చ మన్నాడు జె పి. ఇంత రాద్దాంతం జరుగుతుంటే ఏమీ జరగనట్టు ఉండద్దు అన్నాడు.  

అయినా ...  

హ్మ్ .. పోనీ నీ రూట లోనే ఆలోసిద్దామ్.   ఈయన సెప్ప లేదు అనుకుందాం. సొనియమ్మ యిభజన సేయ కుండా వదిలేత్తుందా.

మానదనుకో

పోనీ సొనియమ్మ , కాంగ్రెసు ఇచ్చే లోపే ఈ యెలచ్చన్లో ఓడి పోయిందనుకో వచ్చే బి జె పి నో,  మోడీ నో తెలంగాణా ఇవ్వకుండా ఉంటాడా

అవుననుకో

పోనీ ఇప్పుడు కొంపలు ముంచేసాడని గగ్గోలు ఎట్టేత్తున్ననాయకులు ఆపడానికి ఏం సేశారు. పోనీ వీళ్ళకి ఆపే  సత్తా ఉందా. హమ్మయ్య ఇంకో రోజు దాటెయ్యచ్చు అని నాన్చడం తప్ప ఒక్క కొలిక్కి తెచ్చారా అయిదేళ్ళు గా. 

అవును బా

ఇప్పుడు ఈయన సెప్పిందేటి? ఇచ్చేది ఎలాగు ఇత్తున్నారు గా. ఇచ్చేదేదో సక్కగా పద్దతిగా ఇమ్మని కదా. రాయలసీమ వాళ్ళకి పన్ను ఉండకపోతే అదేదో స్పెసల్ టేటస్ యిత్తే  బోలెడు పెట్టుబడి పెట్టి యాపారాలు పెడతారు. కరువు తీరిపోద్ది.  కోస్తాకి పోలవరం ప్రాజెక్టు, రామయపట్నం పోర్టు, సదుకోడానికి మంచి కాలేజీలు. ఇక తెలంగాణా కి హైదరాబాదు ఎలాగో ఉంది కదా.   

బావుంది బా. కానీ ఇవన్నీ ఎప్పటికి వచ్చేను ? వాళ్ళు ఇచ్చేనా చచ్చేనా 

అది కాదు రా.  ఇప్పుడు తెలంగాణా కి ఒప్పుకుంటే ఇవి అడగడానికి ఈలు ఉంటాది. ఇప్పుడు  తెలంగాణా 
వల్ల కాదు అని మొండికేసుకుని కూకుంటే వాళ్ళు మొండికేసి ఇభజన సేసేత్తే . ఏంటి పరిత్తితి ?
ఇప్పుడు కాకపోతే ఇంకో మూడేళ్ళ లో లేక అయిదేళ్ళలో లేక పదేళ్ళలో ఇభజన అయిందనుకో. అప్పుడు ఇంకా నట్టమే కదా .. అదేదో ఇప్పుడే అయితే ఈ లోపు వేరేవి ఒకటో రెండో పతనాలు బాగు పడతాయి  కదా. 
అదీ కాక  ఈ గొడవలు తగ్గడం వల్ల ఇంకొన్ని ఊర్లు , మూడు ప్రాంతాలూ  బాగు పడతాయేమో? 

అలగయితే బా , మీ సావు మీరు సావండి . నేనిచ్చి తీరుతా అన్న సొనియమ్మని, మీరు కాకపోతే నేనిస్తా అన్న మోడీ ని, ఒక గడియ "అయితే  ఓకే"  , ఒక గడియ "నేనొప్పుకోను" అనే బాబుని,  యిభజిస్తే సి ఎమ్ అయిపోదామనే ఓదార్పన్నని వదిలేసి జె పి  మీద పడ్డారేటి  బా అందరూ 
అదేరా  మరి . మెత్తగా ఉంటే మొత్త  బుద్ది అని



https://www.youtube.com/watch?v=vQKFGtNmxMw




Wednesday, October 28, 2009

టి వి చానళ్ళ అత్యుత్సాహం - కొత్తగా పుట్టుకొచ్చిన భాషాభిమానం

ప్రసార మాధ్యమాల పుణ్యమా అని ఈ పాటికి మైదకూరు లో జరిగిన ఉదంతం, దాని మీద చేసిన రాగ్దాంతం చూసి ఉంటారు. తెలుగులో మాట్లాడిన విద్యార్థులు మెడలో I never speak in telugu అని రాసి ఒక బిళ్ళ తగిలించడం.  


ఈ టీవి చానల్లు తెలుగు భాషను ఉద్ధరించేస్తున్నట్టు, తెగ బాధ పడిపోతున్నాయి. ఇప్పుడే టి వి 9 ఒక కార్యక్రమం చూసాను (అమ్మకి అవమానం) కొంచం చూసి ఇంత సిగ్గులేకుండా ఎలా మాట్లాడతారా అనిపించింది. ప్రతీది రచ్చ చెయ్యడం వీళ్ళకి అలవాటైపోయింది. ముందు ఎవరన్న వీళ్ళ మీద ఒక ఉద్యమం మొదలెట్టాలి. పరబాష లో కార్యక్రమాలు, వాటి పేర్లు ఉండకూడదని. ఒక్కళ్ళకి 'ళ' 'ణ' పలకడం రాదు. ఒక వాక్యం మాట్లాడితే దాంట్లో 90% ఆంగ్ల పదాలే. టీవీ 9 లో ఐతే బూతద్దం పెట్టి వెతికినా ఒక్క తెలుగు కార్యక్రమం పేరుండదు.  


ఇక ఆ పాఠశాలలో జరిగిన విషయమైతే చాలా శోచనీయం. కానీ అలాటివి బోళ్ళు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడాలని తల్లి తండ్రులకు ఉంటే తప్ప చెయ్యకలిగిందేమి లేదనిపిస్తుంది నాకు. వాళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే, ఫ్యూచర్ లో కష్టం అని అంటారు. మైదుకూరు లాటి సంఘటనలు జరిగే సరికి, జనాల్లో రగ్గు కప్పుకుని నిదరపోతున్న భాషాభిమానం, మాతృ బాష మీద ప్రేమ పొంగుకొచ్చేస్తాయ్ . సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏవేవో ప్రతిపాదించేస్తారు . ఆంగ్లం రద్దు చెయ్యాలి, తెలుగు ని ముద్దు చెయ్యాలి అని. తెలుగు నేర్చుకోడానికి , కేవలం తెలుగు లో బోధన, ఆంగ్లం వాడకపోవడం కాదు కావాల్సింది. తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగచెయ్యాలి పిల్లలకి. ఇష్టంగా పిల్లలు చదివేడట్టు పుస్తకాలు, లేక సి డి లు (ఇవి కొన్ని ఇప్పటికే ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువగా) రావాలి. చందమామ లాటివి చదవడం అలవాటు చేస్తే, వాటి కంటే మేలు చేసేవి ఉండవు భాషా వికాసానికి. పెదబాల శిక్ష ఉంటే బూజు దులిపి, లేకపోతె కొని, పిల్లలకి చదివి చెప్పాలి, చదివించాలి. హ్యారీ పాటర్ (నేను చదవలేదు, మంచి పుస్తకమని విన్నాను)ని తలదన్నే పుస్తాకాలు తెలుగులో ఉండి ఉంటాయ్. కాకపొతే ఇంగ్లీష్ పుస్తకాల మీద ఉన్నంత ఆసక్తి తెలుగు పుస్తకాల మీద ఉండేడట్టు తల్లి తండ్రులు చెయ్యాలి. ఈ భాషా సంఘాలు,తెలుగు విశ్వవిద్యాలయాలు నిజంగా ఎమన్నా చేయదల్చుకుంటే, కొంత డబ్బు వెచ్చించి, బాలల సాహిత్యాన్ని మంచి నాణ్యతతో, ప్రమాణాలతో ప్రచురించాలి. (తినాలంటే రుచి తో పాటు రూపు కూడా అవసరం కదా ). వీలయితే పాఠశాలలకి ఉచితంగా కాపీలని ఇవ్వాలి. తరచూ పిల్లల కోసం తెలుగు భాష కి సంబంధించిన  వినోద కార్యక్రమాలు నిర్వహించాలి . ముఖ్యంగా ఇలాటి వాటిలో సుదీర్ఘ ఉపన్యాసాలు అవి ఇచ్చి బెదరగొట్టకుండా , వారికి నచ్చే రీతిలో చెయ్యాలి. వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేడట్టు చూడాలి. నాకు టీవీ లో పాటల పోటీలు అవి చూసినప్పుడు, తెలుగు భాషకేం ఢోకా లేదు అనిపిస్తుంది, అంత స్పష్టంగా పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ సంఖ్య తక్కువనుకోండి.  


మాతృ భాషలో విద్యా బోధన ఇవన్ని ఇప్పటి కాలమాన పరిస్థితులలో అసాధ్యం కానీ, కనీసం తెలుగు ఖచ్చితంగా తీసుకోవాలి అని హైస్కూల్ వరకు అన్నా పెడితే బావుంటుంది (ఇది ఇప్పటికే ఉందేమో నాకు తెలియదు. ఉంటే పాటించట్లేదని మాత్రం చెప్పగలను .)  


మైదకూరు ఉదంతం వల్ల జరిగిన మంచి ఎమన్నా ఉంటే, అది జనాలు ఓ నాలుగు రోజులు తెలుగు గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత మల్లి మామూలే, మర్చిపోతారు.  


ఈ సందర్భం లో నేను రాసిన పాత టపా ఒకటి గుర్తుకొచ్చింది. టి వి చానల్లు, సినిమాలలో తెలుగు గురించి. http://maanasasanchara.blogspot.com/2008/06/blog-post.html




P.S. రాము గారు ఈ అతిని ఇంకా బాగా ఎండగట్టారు. చూడండి.
http://apmediakaburlu.blogspot.com/2009/10/blog-post_2



Monday, June 16, 2008

తప్పెవరిది

- వాసు

ప్పుడప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమని చూస్తే జాలి వేస్తుంది, తెలుగు ప్రచార మాధ్యమాలని చూస్తే భయం వేస్తుంది.

తెలుగు సినీ పరిశ్రమ లో కొంత మంది దర్శక నిర్మాతలకు భాషాభిమానం, ఆత్మాభిమానం లాంటివి చాలా పెద్ద పదాలు, అసల తెలుగు వాళ్ళమని గుర్తుందా అనిపిస్తుంది. యేటా వచ్చే చిత్రాల్లో మూడో వంతు తమిళానువాద చిత్రాలుఉన్నాయంటే ఆందోళన పడాల్సిన సమయం, అలోచించవలసిన అవసరం ఉన్నాయని తేటతెల్లమవుతోంది. శంకర్, మణిరత్నం లాటి పెద్ద దర్శకుల చిత్రాలే కాక కొత్తవారి చిత్రాలకు (డబ్బింగ్) తమిళ నాడు కంటే మన రాష్ట్రం పెద్ద మార్కెట్అంటే మనవారి విశాల హృదయానికి ఆనంద పడాలొ, మన తెలుగు పరిశ్రమ కొల్పోతున్న అవకాశాలకు బాధ పడాలోఅర్థం కావట్లేదు.

ఏ మాత్రం బావున్నా వచ్చిన ప్రతీ అనువాద చిత్రాన్ని హిట్ చేసే మన తెలుగు వాళ్ళు, మన చిత్రాలు పక్క రాష్త్రంలోఆడడం పక్కన పెట్టండి, కనీసం డబ్బింగ్ కి కూడా నోచుకొవట్లేదని అలోచించరెందుకో? కారణం మనకు లేనిది, వాళ్ళకిఉన్నది - భాషాభిమానం. మంచి సినిమాని ఆదరించడం తప్పని నేననట్లేదు, కాని మనం వారి చిత్రాన్ని ఎలా ఉన్నాచూసేస్తాం అని వారనుకునే స్థాయికి దిగజారడం ముమ్మాటికి మంచిది కాదు.


ఈ వాదన అసమంజసం అని అనుకునే వారికి రెండు ఉదాహరణలు. మొన్న నేను దశావతారం సినెమాకి వెళ్ళాను. సినిమా పేర్లు మొత్తం తమిళం లో ఉన్నాయి. పొరపాటున తమిళ సినిమా వేసారేమో అని కనుక్కుంటే, ఇంతకీ అదితెలుగు దే. ఇక ఆ సినిమాలో ఒక పాత్ర సినిమా పొడవునా తమిళం లోనే మట్లాడుతుంటాడు, చూసేది తెలుగుసినిమానా తమిళ సినిమానా అని అర్థం కానంతగా. ఇది మనం సినిమా ఎలా వేసినా ఎం తీసిన చూసేస్తామనే చులకనభావం అనడానికి ఏం సందేహం లేదు.

ఇది చాలనట్టు, మన దర్శక నిర్మాతలే తొలుత తమిళం లో తీసి తెలుగు లొకి అనువదించడం ఈ పరిణామానికి పరాకష్ట. ఎ.ఎం రత్నం గారు తెలుగు వారయ్యుండి తమిళం లో సినిమాలు తీసి తెలుగు లోకి అనువదించాల్సిన అగత్యమేంటి? తమిళ ప్రేక్షకుల మీద అభిమానమా, తెలుగు వారి మీద హేయ భావమా?? దీనికి తోడు మన దర్శకులు కొందరికి కొత్తపైత్యం మొదలైంది. బుజ్జిగాడు సినిమానే తీసుకోండి. సినిమాలొ హీరో సగం మాటలు తమిళం లోనే ఉంటాయి. ఇదిచలదన్నట్టు ఏకంగా ఒక తమిళ పాట. ఈయనకి అంతకు ముందు తీసిన అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి నించే ఈపైత్యం ఉన్నట్టుంది. పూరీ గారు! మీరు మరీ అంత తమిళ వీరాభిమనులైతే, తమిళ సినిమాలే తీసుకోంది. మీ పైత్యాన్నిమా మీద రుద్దకండి.




సమయం ఉన్నప్పుడు, సమావేశాళ్ళో మైకు దొరికినప్పుడు తెలుగు భాషాభ్యున్నతికి నడుం బిగించాలని గుక్కతిప్పుకొకుండా ఉపన్యాసాలిచ్చే సినీరంగ ప్రముఖులు, ఆ పనికి ఏ మాత్రం పూనుకున్నారో ప్రస్తుతం వస్తున్న సినిమాలుచూస్తేనే తెలుస్తోంది.



ఇది కేవలం సినీ రంగానికే పరిమితం కాదు. అన్ని రకాల ప్రసార మాధ్యమాళ్ళో ఈ దుస్థితి దాపురించింది. ఉదాహరణకిమన నిరంతర వార్తా స్రవంతి టివి9 నే తీసుకోండి.

పస లేని కథనాలని, వార్తలు కాని వార్తలని పక్కన పెట్టినా, వార్తల్లో వాడే భాషని వింటే జన్మ ధన్యమైపోతుంది . ఒక్కళ్ళకీళ ' , 'ణ ' ఉచ్ఛరించడం రాదు. ఇక రచన కర్ణ కఠోరం. "ఇరగదీసాడు", "బాక్సు బద్దలయ్యింది" ఇలాటి పదాలుధారాళంగా, గర్వంగా వాడడం వీరి ప్రత్యేకత. ఇక కార్యక్రమాల పేర్లంటారా - భూతద్దంతో వెతికినా ఒక్క తెలుగు పేరూకనపడదు. ఇవన్నీ ఈ ఛానల్ లొపాలు కాదు, టి.ఆర్.పి లలొ ప్రథమ స్థనం లొ ఉండడానికి కారణాలు.


ఇప్పుడు చెప్పండి తప్పెవరిది? ఏం చెప్తే అది విని, ఏం చూపెడితే చూసి, ఏం మాట్లాడని మనదా, మనకు కావల్సింది ఇదేఅని చూపెడుతున్న వాళ్ళదా??
'